భారతీయ బాలికను చంపిన పాకిస్థానీ కుర్రాడు

భారతీయ బాలికను చంపిన పాకిస్థానీ కుర్రాడు - Sakshi


తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో 14 ఏళ్ల భారతీయ బాలికను చంపేశాడో పాకిస్థానీ కుర్రాడు. అతడి వయసు కూడా 14 ఏళ్లే. ఈ దారుణం దుబాయ్లో జరిగింది. ఆమెను చంపిన తర్వాత ఆత్మాహుతి చేసుకున్నాడు. బాలిక తల్లి ఉద్యోగం కోసం బయటకు వెళ్లిన సమయంలో ఆ కుర్రాడు బాలిక ఉండే ఫ్లాట్కు వెళ్లాడు. తర్వాత వాళ్లిద్దరి మధ్య ఏం గొడవ జరిగిందో మాత్రం స్పష్టంగా తెలియలేదు.



ఆమెను కత్తితో పొడిచి పొడిచి చంపేసిన తర్వాత.. ఇద్దరి మీద కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దాంతో ఆ ఫ్లాట్ లోని బెడ్రూం మొత్తం కూడా తగలబడిపోయింది. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తర్వాత ఇద్దరి మృతదేహాలను వాళ్ల బంధువులకు అందిస్తామని పోలీసులు చెప్పారు. గదిలో ద్రవ ఇంధనం ఉందని అంటున్నారు. ఆ బాలిక మంచి డాన్సర్ కావాలని అనుకునేదని, ప్రముఖ భారతీయ నృత్యబృందంలో ఆమె సభ్యురాలని తెలుస్తోంది. బాలిక కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top