పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్‌!

పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్‌!


లండన్: హాకీ వరల్డ్‌ లీగ్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో మరోసారి పాకిస్థాన్‌ను భారత్‌ చిత్తు చేసింది. 6-1 గోల్స్‌ భారీ తేడాతో దాయాదిపై ఘనవిజయం సాధించింది. వరల్డ్‌ హాకీ లీగ్‌లో 5-8 క్లాసిఫికేషన్‌ గేమ్‌లో గెలిచిన భారత్‌ తదుపరి మ్యాచ్‌లో కెనడాను ఎదుర్కోనుంది. ఐదు లేదా ఆరో స్థానాల కోసం ఈ మ్యాచ్‌ జరగనుంది.



గడిచిన వారం రోజుల్లో దాయాది పాక్‌పై భారత్‌కు ఇది రెండో విజయం కావడం గమనార్హం. వరల్డ్‌ హాకీ లీగ్‌లో భాగంగా ఇంతకుముందు జరిగిన మ్యాచ్‌లోనూ 7-1 గోల్స్‌ తేడాతో పాక్‌ను భారత్‌ చిత్తుచేసింది.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top