కలాంకు ఆర్ఎస్ఎస్ ఘన నివాళులు
న్యూఢిల్లీ: భారతదేశం తన శ్రేష్ఠమైన కుమారుల్లో ఒకరిని పోగొట్టుకున్నదని మాజీ రాష్ట్రపతి ఏపీజీ అబ్దుల్ కలాం మృతి పట్ల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అభిప్రాయపడింది. 'కలాం మరణం దేశానికి పూడ్చలేని లోటు' అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. సహచరుడు సురేశ్ జోషితో కలిసి భగవత్ మంగళవారం ఒక ప్రకటనను విడుదలచేశారు.
అసమాన ధైర్యసాహసం, సంకల్పదీక్ష, నిరంతర శ్రమ, ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలనే అభిలాషలకు కలాం జీవితం ప్రతీక అని, తాను జీవించిన 84 ఏళ్ల లో కలాం మనకు నేర్పిన గొప్పవిషయాలు ఇవేనని మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు. దేశ ప్రధమ పౌరుడిగా తన సత్ప్రవర్తనతో కలాం భారతదేశ కీర్తి ప్రతిష్ఠలను మరింత ఇనుమడింపజేశారని పేర్కొన్నారు.