ఇంజినీర్లు, డాక్టర్లతో దేశాభివృద్ధి సులువు: కలాం
హైదరాబాద్: దేశంలోని ఇంజినీర్లు, డాక్టర్లను ప్రొత్సహిస్తే అద్భుతాలు సృష్టించగలరని భారత మాజీ రాష్టపతి, ప్రముఖ శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం అన్నారు. కానీ వారు తమతమ వృత్తుల్లో చాలా బిజీగా ఉన్నారని అన్నారు. శుక్రవారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన బయోమెడికల్ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఇంజినీర్లు, డాక్టర్లతో దేశాభివృద్ధి సులువుగా సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాని యూనివర్శిటీలకు సూచించారు. సోలార్ పవర్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అబ్దుల్ కలాం ఈ సందర్భంగా వివరించారు.
సంబంధిత వార్తలు