ఉప ఎన్నికల్లో కలసి పనిచేస్తాం..

ఉప ఎన్నికల్లో కలసి పనిచేస్తాం.. - Sakshi


- టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రకటన

వరంగల్
: రానున్న వరంగల్ పార్లమెంట్‌తోపాటు శాసనసభకు జరిగే ఉప ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ సమన్వయంతో కలసి పనిచేస్తాయని టీడీఎల్పీనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. హన్మకొండలో గురువారం రెండు పార్టీల సీనియర్ నాయకులతో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఆ తర్వాత వారు విలేకరులతో మాట్లాడారు. తొలుత ఎర్రబెల్లి మాట్లాడుతూ రానున్న వరంగల్ ఎంపీ ఉప ఎన్నికలు, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్నారు.



రెండు పార్టీలు సమన్వయంగా ముందుకు వెళ్లేందుకు నియోజకవర్గ స్థాయిలో ఇరు పార్టీలకు చెందిన ముగ్గురేసీ సీనియర్ నేతలు కోఆర్డినేటర్లుగా ఉంటారని, వీరికి జిల్లాస్థాయిలోని మరో ముగ్గురు నేతలు సహకరిస్తారన్నారు. అయితే, వరంగల్ ఉప ఎన్నికల అభ్యర్థి నిర్ణయం ఇంకా జరగలేదని ఎర్రబెల్లి వివరించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ సీనియర్ నేతల పర్యవేక్షణలో ఉపఎన్నికల్లో ముందుకు వెళతామని, విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top