భార్యకు అక్షయ్ 'ఐస్ బకెట్ ఛాలెంజ్'!

భార్యకు అక్షయ్ 'ఐస్ బకెట్ ఛాలెంజ్'! - Sakshi


ముంబై: ఐస్ బకెట్ ఛాలెంజ్' కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులతో పాటు బాలీవుడ్ హీరోలు సై అంటున్నారు. తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ చేరిపోయారు. 'డేర్ టూ డ్యాన్స్' కార్యక్రమంలో భాగంగా చిల్లీ ఎన్విరాన్స్ ఆఫ్ కేప్ టౌన్ కు హాజరైన అక్షయ్.. ఐస్ బకెట్ తో తడిసి ముద్దయ్యాడు.  తొలుత ఐస్ బకెట్ ఛాలెంజ్ ను స్వీకరించిన అక్షయ్.. ఆ నీళ్లను తనపై పోయించుకునే ముందు కళ్లు మూసుకుని నిలబడ్డాడు. అంతే అప్పటికే  అక్షయ్ చుటూ సిద్ధంగా ఉన్న పది మంది బకెట్లలోని నీళ్లను అతనిపై పోశారు. దాంతో కాసేపు చలికి వణికిన అక్షయ్ అక్కడ గంతులేస్తూ ఆ అలసటను తీర్చుకున్నాడు. ఈ ఐస్ బకెట్ ఛాలెంజ్ కు తన భార్య ట్వింకిల్ ఖన్నాతో పాటు, కండల వీరుడు సల్మాన్ ఖాన్, జానీ లీవర్ ను అక్షయ్ నామినేట్ చేశాడు.


 


లా గెరిగ్స్ వ్యాధితో బాధపడుతున్న వారికి సహాయం అందించేందుకు ఏర్పాటు చేసిన నిధికి కోసం అమెరికాలో ఐస్ బకెట్ ఛాలెంజ్ ను ప్రారంభించారు. ఎవరైనా ఐస్ నీళ్లతో స్నానం చేసి.. మరి కొంతమందికి ఛాలెంజ్ ను విసరడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ ఛాలెంజ్ ను ప్రపంచంలోని ప్రముఖలందరూ స్వీకరిస్తున్నారు. అంతకుముందు అమెరికా మాజీ ఆధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ కూడా ఈ ఛాలెంజ్ లో భాగస్వామి అయ్యారు. నేవి బ్లూ క్రూనెక్ టీషర్టు ధరించిన బుష్.. ఐఎస్ వాటర్ బకెట్ ను తన మీద కుమ్మరించుకున్నారు. అంతేకాకుండా తన కూతరు జెన్నా బుష్ హెగర్ ను ఈ ఛాలెంజ్ కు నామినేట్ చేశారు. ఐస్ వాటర్ స్నానం చేసిన బుష్ నిధి కోసం ఓ చెక్ కూడా రాశారు.  

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top