కేసీఆర్ను స్వయంగా ఆహ్వానిస్తా: బాబు

కేసీఆర్ను స్వయంగా ఆహ్వానిస్తా: బాబు - Sakshi


విజయవాడ: ఈ నెల 22న జరుగనున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని 'అమరావతి' శంకుస్థాపనకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును తానే స్వయంగా ఆహ్వానిస్తానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. స్వయంగా తాను కేసీఆర్ను కలిసి ఆహ్వానం అందజేస్తానని చంద్రబాబు మంత్రులకు తెలిపారు. 'అమరావతి' శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా హాజరుకానున్న విషయం తెలిసిందే. చంద్రబాబు ఆహ్వానానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top