'నా సొంతానికి వాడుకోలేదు'

'నా సొంతానికి వాడుకోలేదు' - Sakshi


న్యూఢిల్లీ: తనపై వచ్చిన ఆరోపణలపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందించారు. అధికారంలో ఉన్నప్పుడు తాను ఎటువంటి ఆశ్రిత పక్షపాతం చూపించలేదని వివరణ ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాన్ని తన సొంతానికి, కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల కోసం వాడుకోలేదన్నారు. అవినీతి పేరుతో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజల దృష్టిని అనవసర విషయాలవైపు మళ్లిస్తోందని ఆయన ఆరోపించారు.



ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అవకాశం లేదన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆర్థిక అభివృద్ధి స్తంభించిందన్న ఆరోపణలను మన్మోహన్ సింగ్ తోసిపుచ్చారు. తాము దిగిపోయే నాటికి మనదేశం ప్రపంచంలో వేగంగా వృద్ధి సాధించిన రెండో ఆర్థిక వ్యవస్థగా నిలిచిందన్నారు. మోదీ ఏలుబడిలో ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.



2జీ టెలికం లెసైన్సుల విషయంలో సహకరించకుంటే హాని చేస్తానంటూ అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ తనను బెదిరించారని ట్రాయ్ మాజీ చీఫ్ ప్రదీప్ బైజాల్ తన పుస్తకంలో ఆరోపించిన సంగతి తెలిసిందే.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top