ఉస్మానియా ఆర్ట్ కాలేజీ వద్ద ఉద్రిక్తత

ఉస్మానియా ఆర్ట్ కాలేజీ వద్ద ఉద్రిక్తత


హైదరాబాద్: ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. టీటీడీఎల్పీ ఉప నేత రేవంత్రెడ్డికి ఓటుకు నోటు వ్యవహారంలో బెయిల్ రావడంపై ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. అందులోభాగంగా రేవంత్రెడ్డి ఫ్లెక్సీపై విద్యార్థులు పెట్రోల్ తగలబెట్టారు. ఆ క్రమంలో అక్కడే ఉన్న విద్యార్థి శివన్నారాయణపై ప్రమాదవశాత్తూ పెట్రోల్ పడి... మంటలు చెలరేగాయి.


ఉహించని పరిణామం ఒక్కసారి ఎదురుకావడంతో అక్కడే ఉన్న విద్యార్థులంతా ఆందోళనకు గురైయ్యారు. ఆ వెంటనే తేరుకుని శివన్నారాయణకు అంటుకున్న మంటలను ఆర్పివేసి... ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఓయూ క్యాంపస్ పోలీసులు... ఆర్ట్స్ కాలేజీ వద్ద భారీగా సిబ్బందిని మోహరించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top