వైఎస్ఆర్సీపీని ఆహ్వానించండి..
హైదరాబాద్: అఖిలపక్ష సమావేశాలకు వైఎస్ఆర్సీపీని ఆహ్వానించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలపునర్విభజన అంశంపై జరిగిన అఖిలపక్ష సమావేశానికి తెలంగాణ వైఎస్ఆర్సీపీని ఆహ్వానించకపోవడంపై ఆ పార్టీనేత శివకుమార్ హైకోర్టును ఆశ్రయించారు. శివకుమార్ పిటిషన్ను విచారించిన హైకోర్టు ఈ మేరకు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ జిల్లాల పునర్విభజనపై జరిగిన అఖిలపక్షానికి వైఎస్ఆర్ సీపీని ఆహ్వానించకపోవడంపై తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ట్యాంక్బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగిన విషయం తెలిసిందే.