కాకినాడ కేంద్రంగా హార్డ్ వేర్ పార్క్

కాకినాడ కేంద్రంగా హార్డ్ వేర్ పార్క్ - Sakshi


న్యూఢిల్లీ: కాకినాడ కేంద్రంగా హార్డ్ వేర్ పార్క్ ఏర్పాటు చేయనున్నామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. కాకినాడ పోర్టుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీయిచ్చారు. లోకసభలో 2014-15 ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెడుతూ కేంద్ర  ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ మేరకు ప్రకటన చేశారు.



ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు ఆయనకు పలు పథకాలు ప్రకటించారు. కృష్ణపట్నం ఓడరేవుకు అదనపు నిధులిస్తామన్నారు. విశాఖ- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో 20 పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top