జీఎస్‌టీ బిల్లు రేపు లోక్‌సభలో


న్యూఢిల్లీ:  కీలకమైన వస్తు సేవలపన్ను(జీఎస్‌టీ) బిల్లు  లోక్‌సభకు రానుంది.  కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న  గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) బిల్లును  రేపు (శుక్రవారం)లోక్‌ సభలో ప్రవేశపెట్టనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన  కేంద్ర క్యాబినెట్‌ ఈ సోమవారం   ఈబిల్లుకు ఆమోద ముద్ర వేసింది. అంతకుముందు ఈ బిల్లులో కీలకమైన అయిదు ముసాయిదా చట్టాలకు జీఎస్‌ టీ కౌన్సిల్‌  ఆమోదం  తెలిపింది.   అనంతరం దీన్ని పార్లమెంటు  ఆమోదించాల్సి ఉంది. ఈ క్రమంలో లోక్‌సభ లో ఆమోదం కోసం  రేపు సభముందు ఉంచనున్నట్టు తెలుస్తోంది.  దీంతో ఈ బిల్లుపై హాట్‌ హాట్‌ చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.

 

జీఎస్‌టీని సాధ్యమైనంత త్వరగా అమలులోకి త్వరగా అమల్లోకి తీసుకురావాలని   ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ తీవ్ర కసరత్తు చేస్తున్నారు.  ఈ క్రమంలో జులై 1, 2017 నుంచి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం  యోచిస్తున్నసంగతి తెలిసిందే.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top