'హోదా తరహాలోనే ఏపీకి రాయితీలు ఇవ్వాలి'

'హోదా తరహాలోనే ఏపీకి రాయితీలు ఇవ్వాలి' - Sakshi

న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ఇస్తున్న రాయితీలన్నింటినీ ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఇవ్వాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర బడ్జెట్‌పై మంగళవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడారు.



రాష్ట్ర విభజన సందర్భంగా నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఏపీకి పన్నురాయితీలు కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. విభజనతో నష్టపోయిన ఏపీని అభివృద్ధి చేసేందుకు రూ. 5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి ఆదాయపన్ను మినహాయింపు ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని కోరారు. 

 
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top