జ్యూస్ లో మత్తుమందు కలిపి...

జ్యూస్ లో మత్తుమందు కలిపి... - Sakshi


ఘజియాబాద్(యూపీ): అత్యాచార ఆరోపణలతో ఘజియాబాద్ బిల్డర్ ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన కంపెనీపై పనిచేసే ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో నిర్మాణ సంస్థ మర్సాస్ అగ్రోవెట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వి. రాజ్ జార్జిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.



ఆఫీసులో అందరూ వెళ్లిపోయిన తర్వాత జ్యూస్ లో మత్తుమందు కలిపి అతడీ దారుణానికి ఒడిగట్టినట్టు బాధితురాలు పోలీసులకు తెలిపింది. అక్కడితో ఆగకుండా పెళ్లిచేసుకుంటానని చెప్పి పలుమూర్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని వెల్లడించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాజ్ జార్జిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఎదుట హాజరుపరిచిన తర్వాత జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top