అమెరికా బీరు కంపెనీపై ఫిర్యాదు
ముంబై: భారత జాతిపిత మహాత్మ గాంధీ ఫోటోలను బీరు సీసాలపై ముద్రించి మార్కెట్ లోకి విడుదల చేసిన అమెరికాకు చెందిన న్యూఇంగ్లండ్ బ్రెవింగ్ కంపెనీపై కోర్టులో ఫిర్యాదు దాఖలైంది. కన్జుమర్ గైడెన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా మీడియా సెల్ అధ్యక్షుడు వివేక్ శెట్టి ఈ మేరకు అంధేరీలోని 66వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు.
'గాంధీజీ భారత జాతిపిత. ఆయనను మేమెంతో గౌరవిస్తాం. గాంధీ ఫోటోలను బీరు సీసాలపై ముద్రించి భారత్ లో విడుదల చేయడం మాకెంతో దిగ్భ్రాంతి కలిగించింది' అని వివేక్ శెట్టి ఫిర్యాదులో పేర్కొన్నారు. గాంధీ సిద్ధాంతాలను అవహేళన చేసిన న్యూఇంగ్లండ్ బ్రెవింగ్ కంపెనీపై చట్టప్రకారం చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.