ఆటోను ఢీకొట్టిన లారీ; నలుగురి మృతి

ఆటోను ఢీకొట్టిన లారీ; నలుగురి మృతి


నెల్లూరు( కోవూరు): నెల్లూరు జిల్లాలోని కోవూరు జాతీయ రహదారిపై సోమవారం రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతిచెందగా, ఇద్దరికి గాయాలు అయినట్టు తెలిసింది. ఎదురుగా వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.



లారీ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top