బీజేపీలో చేరిన ఎస్‌ఎం కృష్ణ

బీజేపీలో చేరిన ఎస్‌ఎం కృష్ణ - Sakshi


న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ఎస్‌.ఎం.కృష్ణ బీజేపీలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, సీనియర్‌ నేతలు అనంత్‌కుమార్, మురళీధర్‌ రావు సమక్షంలో బుధవారం ఢిల్లీలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా అమిత్‌షా పార్టీ కండువా కప్పి ఎస్‌.ఎం.కృష్ణను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.


అనంతరం ఎస్‌.ఎం.కృష్ణ మాట్లాడుతూ, తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇప్పుడు కొత్త ప్రయాణం ఆరంభమవుతోందని, బీజేపీలో చేరడం తనకు సంతోషంగా ఉందని అన్నారు. కర్ణాటకలోనూ, జాతీయ రాజకీయాల్లోనూ తాను గతంలో పలు కీలక పదవులు చేపట్టానని అన్నారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయి వంటి పలువురు బీజేపీ నేతలతోనూ తనకు అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ఎస్‌.ఎం.కృష్ణ... బీజేపీలో చేరడంతో కర్ణాటకలో తమ పార్టీ మరింత బలపడుతుందని అమిత్‌షా అన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top