సుప్రీంకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ కన్నుమూత

సుప్రీంకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ కన్నుమూత


కోల్‌కతా: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అల్తామస్ కబీర్ (68) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కోల్‌కతాలో తుదిశ్వాస విడిచారు.



1948లో కోల్‌కతాలో జన్మించిన కబీర్.. సుప్రీం కోర్టు 39వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2012 సెప్టెంబర్ 29 నుంచి 2013 జూలై 18 వరకు ఆయన ఈ పదవిలో ఉన్నారు. అంతకుముందు జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top