ఎన్నికల షెడ్యూల్కు తుదిమెరుగులు: ఏప్రిల్ 7 నుంచి ఎన్నికలు
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం(ఈసి) సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్కు తుదిమెరుగులు దిద్దుతోంది. ఈ విషయమై ఈసి అధికారులు కేంద్ర హోంశాఖ అధికారులతో విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతున్నారు. రెండు మూడు రోజులలో ఎన్నికల షెడ్యూల్కు తుదిరూపం తీసుకువస్తారు.
దేశవ్యాప్తంగా మొత్తం 7 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 2వ వారం నుంచి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ 7-10 మధ్య మొదటి విడత పోలింగ్ జరుగుతుందని ఈసీ వర్గాల సమాచారం. బుధవారం లేదా గురువారం ఎన్నికల షెడ్యూలు విడుదల చేస్తారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలలో లోక్సభతో పాటు శాసనసభ ఎన్నికలు కూడా నిర్వహిస్తారు.
సంబంధిత వార్తలు