మావోయిస్టులు - భద్రతాదళాల మధ్య ఎన్కౌంటర్
జార్ఖండ్లోని డుమ్కా జిల్లాలోని సురువపని అడవిలో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ అడవుల్లో సాయుధులైన మావోయిస్టులు సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో ఎస్ఎస్బీ, జార్ఖండ్ జాగ్వార్, జిల్లా పోలీసులతో కూడిన భద్రతా దళాలు కూంబింగ్కు వెళ్లాయని జిల్లా ఎస్పీ అనూప్ టి మాథ్యూ తెలిపారు. అక్కడ మావోయిస్టులు ఎదురు పడటంతో ఇరువర్గాల మధ్య దాదాపు వంద రౌండ్ల వరకు బుల్లెట్లు పేలాయి.
ఈ ఎన్కౌంటర్ దాదాపు రెండు గంటల పాటు సాగింది. అయితే రెండు వైపులా ఎవరూ మరణించలేదని తెలిసింది. భద్రతాదళాలది పైచేయి కావడంతో మావోయిస్టులు అక్కడినుంచి తప్పించుకుని పారిపోయారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత భారీగా కూంబింగ్ జరిపినా, ఎవ్వరూ దొరకలేదు.