ఉపాధి కల్పనలో 34 శాతం పెరుగుదల
న్యూఢిల్లీ: దేశంలో 2005తో పోలిస్తే 2013 నాటికి ఎనిమిదేళ్లలో ఉద్యోగుల సంఖ్య 34.25 శాతం మేరకు పెరిగి 12.77 కోట్లకు చేరింది. ‘ఆరవ ఆర్థిక గణన’లో ఈ విషయం వెల్లడైంది. ఎనిమిదేళ్ల లో ఉపాధి కల్పనలో 34 శాతం వృద్ధి చోటు చేసుకోవడం స్వాగతనీయమని జాతీయ గణాంకాల కమిషన్ చైర్మన్ ప్రణబ్సేన్ అన్నారు. వివరాలిలా ఉన్నాయి.
2005తో పోలిస్తే 2013 నాటికి పట్టణాల్లో ఉపాధి కల్పన 37.46 శాతం పెరిగి ఉద్యోగుల సంఖ్య 6.14 కోట్లకు చేరగా, పల్లెల్లో 31.59 శాతం పెరిగి ఉద్యోగుల సంఖ్య 6.62 కోట్లకు చేరింది. 2013 నాటికి ఉద్యోగినుల సంఖ్య 25.56 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో మహిళా కార్మికుల సంఖ్య 19.8 శాతంగా ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో 30.9 శాతంగా ఉంది. మహారాష్ట్రలో అత్యధికంగా 1.43 కోట్ల మంది ఉద్యోగులు ఉన్నారు.