టోల్‌టాక్స్ వసూలుకు ఎలక్ట్రానిక్ వ్యవస్థ


న్యూఢిల్లీ: రహదారులపై టోల్ టాక్స్ వసూళ్లకు సంబంధించిన అంశం గురువారం లోక్‌సభలో వాడివేడి చర్చకు దారితీసింది. టోల్ వసూళ్ల విధానంలో పారదర్శకత లోపించిందని పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ జోక్యం చేసుకుని, సభ్యులు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. టోల్ వసూళ్ల ప్రక్రియను పారదర్శకంగా మార్చడానికి ఎలక్ట్రానిక్ వ్యవస్థ ఏర్పాటుకోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రహదారులు, రవాణాశాఖ సహాయ మంత్రి క్రిషన్‌పాల్ గుర్జార్ ఈ సందర్భంగా సభకు తెలిపారు. 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top