వారంపాటు 28 రైళ్లు రద్దు
పాట్నా: బీహార్, జార్ఖండ్లో వారంపాటు పలు రైళ్లు నిలిచిపోనున్నాయి. మావోయిస్టు పార్టీ వ్యవస్థాపక దినోత్సవాల నేపథ్యంలో రైల్వే శాఖ ఈ రెండు రాష్ట్రాల్లోని ఐదు డివిజన్ల పరిధిలో 28 పాసింజర్ రైళ్లను ఆదివారం నుంచి రద్దు చేయనుంది. మావోయిస్టుల దాడుల భయంతో మావోయిస్టులు రైళ్లపై దాడులకు పాల్పడిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లను మాత్రమే భద్రత మధ్య నడపాలని నిర్ణయించినట్లు తూర్పు మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి అరవింద్ కుమార్ రజక్ తెలిపారు.
ఈ నెల 21 నుంచి 27 వరకు పాసింజర్ రైళ్లను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. మావోయిస్టులు తమ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈ నెల 21 నుంచి 30 మధ్య జరపనున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.