జీవితాల్ని నాశనం చేశారు: పూరీ

జీవితాల్ని నాశనం చేశారు: పూరీ - Sakshi


మావాళ్లు నాలుగు రోజులుగా ఏడుస్తూనే ఉన్నారు

చానళ్ల తీరుపై పూరీ స్పందన

సిట్‌ విచారణ అనంతరం ట్వీటర్‌లో వీడియో పోస్ట్‌




సాక్షి, హైదరాబాద్‌: సిట్‌ అధికారులు విచారణకు ఎప్పుడు పిలిచినా వెళ్తానని డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ తెలిపారు. సిట్‌ విచారణ అనంతరం ట్విటర్‌లో పూరి ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ‘‘ఈ రోజు సిట్‌ ఆఫీసుకు వెళ్లాను. అక్కడ సిట్‌ అధికారులు నా మీద ఉన్న ఆరోపణల గురించి చాలా ప్రశ్నలు వేశారు. వాటికి సమాధానం చెప్పాను. కెల్విన్‌ ముఠాతో నాకు పరిచయం లేదని.. కెల్విన్‌ను ఎప్పుడూ కలవలేదని వారికి క్లియర్‌గా చెప్పాను. మళ్లీ వాళ్లు ఎప్పుడు పిలిచినా వెళ్లడానికి నేను రెడీగా ఉన్నాను.



బేసికల్‌గా.. నేనెప్పుడూ వెరీ రెస్పాన్స్‌బుల్‌ పర్సన్‌ను. ఎనీథింగ్‌ ఇల్లీగల్‌.. నాట్‌ ఓన్లీ డ్రగ్స్‌ నేనెప్పుడూ చేయను. అలాంటి పనులు నేనెప్పుడూ లైఫ్‌లో చేయలేదు. చేయను. నాకు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ అంటే చాలా ఇష్టం. చాలా సినిమాలు చేశాను డిపార్ట్‌మెంట్‌ గురించి.. జర్నలిస్టులపై ప్రేమతో ఇజం సినిమా తీశాను. కానీ నాకు చాలా బాధగా ఉంది. ఇవాళ అన్ని చానల్స్‌లో ఉన్న మీడియా మిత్రులు అందరూ నాకు ఫ్రెండ్స్‌.. వన్‌ ఇన్‌టు వన్‌ కలుస్తాం.. మేం అందరం మాట్లాడుకుంటాం.. కాఫీ తాగుతాం.. ఇంత ఫ్రెండ్లీగా ఉన్న వీరు.. వెన్‌ టైం కమ్స్‌.. లైక్‌.. వారు చేసిన ప్రొగ్రామ్స్‌.. వాళ్లకు తెలిసినా తెలియకున్నా.. అరగంట ప్రోగ్రామ్స్‌ చేసి.. నిజం చెప్పాలంటే జీవితాల్ని నాశనం చేశారు. మా అమ్మ. వైఫ్, పిల్లలు.. అన్నదమ్ములు.. నాలుగు రోజుల నుంచి ఏడుస్తూనే ఉన్నారు. నేనే కాదు.. చాలా కుటుంబాలు అందరూ.. నాకు నిజంగా మీడియాపై చాలా బాధగా ఉంది. ఎందుకంటే.. అందరూ తెలుసు. రేపు మళ్లీ మనం కలుస్తాం కూడా.. బట్‌ చాలా డిస్ట్రబ్‌ చేశారు. ఏదైనా ఉంటే.. రేపు సిట్‌ ఆఫీసర్లు డిసైడ్‌ చేస్తారు..’’ అని పూరి అన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top