'డోన్ట్ వరీ, ఆల్ ఈజ్ వెల్'
న్యూఢిల్లీ: తమ పార్టీలో ఎటువంటి సమస్య లేదని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆందోళన పడాల్సిన అవసరం లేదని, తమ పార్టీలో పరిస్థితి చక్కబడిందని వ్యాఖ్యానించారు. ఆప్ లో తలెత్తిన సమస్యలను పరిష్కారం చేసుకోగలమని విలేకరులతో చెప్పారు. డోన్ట్ వరీ, ఆల్ ఈజ్ వెల్ అని వ్యాఖ్యానించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో సంక్షోభం ముదరడంతో పార్టీ జాతీయ కార్యవర్గం నుంచి అసమ్మతి నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్లను తొలగించారు. ప్రశాంత్ భూషణ్ను పార్టీ క్రమశిక్షణ కమిటీ నుంచి కూడా తొలగిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. అంతర్గత లోక్పాల్ పదవి నుంచి నేవీ మాజీ చీఫ్ ఎల్.రాందాస్నూ సాగనంపింది.
సంబంధిత వార్తలు