విమానంలో చెక్కర్లు ఆపి.... ఒత్తిడి తీసుకురా
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిపై సీపీఐ నేత నారాయణ మంగళవారం నెల్లూరులో మండిపడ్డారు. ప్రత్యేక విమానాల్లో చెక్కర్లు కొట్టడం మాని... రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకు వచ్చేలా ఢిల్లీలో ఒత్తిడి తీసుకురావాలని చంద్రబాబుకు నారాయణ హితవు పలికారు. ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్యనాయుడు తెలుగు ప్రజల ద్రోహిగా మిగిలిపోయారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై మోదీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై ప్రజల్లో తీవ్ర ఆందోళనలు నెలకొంది. అదికాక చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని .... రాష్ట్రంలో పెట్టుబడులు పేరిట ప్రత్యేక విమానాలలో వరుసగా విదేశాలకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ విదేశీ ప్రయాణాలు ఆపి... ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తేస్తే ఆంధ్రప్రదేశ్ కు లాభం కలుగుతుందని సీపీఐ నారాయణ భావించారు. ఈ నేపథ్యంలో నారాయణ పైవిధంగా స్పందించారు.