నిజాయితీగా ట్యాక్స్ కట్టేవారెందరు?
ముంబై: అవినీతికి పాల్పడటం ప్రతీ ఒక్కరి జీవితంలో సాధారణంగా మారిపోయిందని బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ స్పష్టం చేశారు. ఏదొక సందర్భంలో ప్రజలు అవినీతికి పాల్పడుతుండటం నిజంగా బాధాకరమన్నారు. ఈ దుష్ట సంస్కృతి ప్రజల్లో నాటుకుపోవడంపై అమీర్ ఆవేదన వ్యక్తం చేశారు. 'పంచాయత్ ఆజ్ తక్' కార్యక్రమానికి విచ్చేసిన అమీర్ పై విధంగా వ్యాఖ్యానించారు. అసలు మనలో ఎంతమంది సజావుగా ప్రభుత్వానికి పన్ను కడుతున్నారని ప్రశ్నించారు. ' అవినీతిని అరికట్టాల్సిన బాధ్యత మనపైనే ఉంది. అవినీతిని ప్రతీ ఒక్కరూ ఏదో రూపంలో ప్రోత్సహిస్తున్నారు.
ఆ మహమ్మారిని అరికట్టడానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి. పార్లమెంట్ సభ్యులు చేసే చట్టాలతో అవినీతి అంతం కాదు. అది ప్రతీ మనిషి యొక్క బాధ్యత. మనల్ని మనం సరిదిద్దుకున్నప్పుడే దేశం ముందుకు పయనిస్తుందని తెలిపారు.
సంబంధిత వార్తలు