నిజాయితీగా ట్యాక్స్ కట్టేవారెందరు?

నిజాయితీగా ట్యాక్స్ కట్టేవారెందరు? - Sakshi


ముంబై: అవినీతికి పాల్పడటం ప్రతీ ఒక్కరి జీవితంలో సాధారణంగా మారిపోయిందని బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ స్పష్టం చేశారు. ఏదొక సందర్భంలో ప్రజలు అవినీతికి పాల్పడుతుండటం నిజంగా బాధాకరమన్నారు. ఈ దుష్ట సంస్కృతి ప్రజల్లో నాటుకుపోవడంపై అమీర్ ఆవేదన వ్యక్తం చేశారు. 'పంచాయత్ ఆజ్ తక్' కార్యక్రమానికి విచ్చేసిన అమీర్ పై విధంగా వ్యాఖ్యానించారు.  అసలు మనలో ఎంతమంది సజావుగా ప్రభుత్వానికి పన్ను కడుతున్నారని ప్రశ్నించారు. ' అవినీతిని అరికట్టాల్సిన బాధ్యత మనపైనే ఉంది. అవినీతిని ప్రతీ ఒక్కరూ ఏదో రూపంలో ప్రోత్సహిస్తున్నారు.


 


ఆ మహమ్మారిని అరికట్టడానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి. పార్లమెంట్ సభ్యులు చేసే చట్టాలతో అవినీతి అంతం కాదు. అది ప్రతీ మనిషి యొక్క బాధ్యత. మనల్ని మనం సరిదిద్దుకున్నప్పుడే దేశం ముందుకు పయనిస్తుందని తెలిపారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top