మళ్లీ అధికారంలోకి వస్తాం: సోనియా

మళ్లీ అధికారంలోకి వస్తాం: సోనియా - Sakshi


న్యూఢిల్లీ: పగటి కలలతో ప్రజలను బీజేపీ మభ్యపెడుతోందని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విమర్శించారు. యూపీఏ పథకాలనే నరేంద్ర మోడీ ప్రభుత్వం కాపీకొడుతోందని ఆరోపించారు. తాము తిరిగి అధికారంలోకి వస్తామని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.



మహిళా కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన సభలో రాహుల్ గాంధీతో కలిసి సోనియా పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ 70వ జయంతిని పురస్కరించుకుని ఈ సభ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సునామీలా మారాల్సిన అవసరముందని సోనియా అభిప్రాపడ్డారు. తమ పార్టీ ప్రజలకు ఎంతో చేసిందని, బీజేపీ తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top