పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీల నిరసన
న్యూఢిల్లీ : పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఎంపీలు మంగళవారం ఆందోళనకు దిగారు. సస్పెన్షన్ను నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీలు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసన తెలిపారు. ఎంపీల ధర్నాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్, ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.
సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించినందుకు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సోమవారం 25మంది ఎంపీలను అయిదు రోజుల పాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కాగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ పార్టీకి సమాజ్ వాదీ, తృణమూల్ కాంగ్రెస్ మద్దుతు తెలిపాయి.