'నా విజయం మా నాన్నకు అంకితం'

'నా విజయం మా నాన్నకు అంకితం'


తిరువనంతపురం: తన విజయాన్ని తండ్రికి అంకితం చేస్తున్నట్టు కాంగ్రెస్ నాయకుడు కేఏస్ శబరినాథన్ ప్రకటించారు. కేరళలోని అరువికర అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో 10,128 ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచారు. తన తండ్రి 24 ఏళ్ల పాటు సేవలందించిన నియోజకవర్గం నుంచి గెలుపొందడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. తన తండ్రి చేసిన సేవలకు గుర్తింపే ఈ విజయమని వ్యాఖ్యానించారు.



తండ్రి కంటే శబరినాథన్ బాగా పనిచేస్తాడా, లేదా అనేది ఇప్పుడే చెప్పలేమని ఆయన తల్లి ఎంటీ సులేఖ అన్నారు. అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన శబరినాథన్ తండ్రి జి. కార్తీకేయన్ మార్చిలో మరణించారు. దీంతో అరువికర అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top