'భారత్ కు తిరిగొచ్చాక దావా వేస్తా'
న్యూయార్క్: తన కోసం ఎయిరిండియా విమానాన్ని ఆపేశారని వచ్చిన వార్తలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఖండించారు. విమానం ఆలస్యంగా బయలుదేరడానికి తాను కారణం కాదని ట్విటర్ లో స్పష్టం చేశారు. తాను నిర్ణీత సమయానికే విమానం ఎక్కానని తెలిపారు. తన సీటులో కూర్చుని విమానం ఎప్పుడు పైకి ఎగురుతుందా అని ఎదురు చూశానని చెప్పారు. తనపై అసత్య ప్రచారం చేసిన వారిపై దావా వేస్తానని హెచ్చరించారు. 'అయిందేదో అయింది. నేను భారత్ కు తిరిగి వచ్చాక పరువు నష్టం దావా వేస్తాన' అని ట్విటర్ లో పేర్కొన్నారు.
కాగా విమానంలో ఉన్న ప్రయాణికుల్లో ఇద్దరు ఫడ్నవిస్ కు బాసటగా నిలిచారు. ఫడ్నవిస్ వల్ల విమానం ఆలస్యం కాలేదని వెల్లడించారు. సీఎం, ఆయన ప్రతినిధుల బృందం ముందుగానే విమానం ఎక్కారని, ఇమ్మిగ్రేషన్ సమస్య కారణంగా విమానం ఆలస్యంగా బయలుదేరిందని తెలిపారు.
జూన్ 29న ముంబై నుంచి అమెరికాకు వెళ్లే ఎయిరిండియా విమానం మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ సహాయకుడు కాలంచెల్లిన వీసాను తీసుకురావడంతో అసలు వీసాను తీసుకువచ్చే వరకూ విమానాన్ని నిలిపేశారని మీడియాలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అమెరికా పర్యటనలో ఉన్న ఫడ్నవిస్... మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సహా పలువురు కార్పొరేట్ దిగ్గజాలతో భేటీ అయ్యారు.
సంబంధిత వార్తలు