కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ సీఎం భేటీ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో.. ఛత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్ శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ భేటీలో విద్యుత్ కొరతను అధిగమించేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేయటం హర్షనీయమని రమణ్ సింగ్ అన్నారు. కరెంటు విషయంలో తెలంగాణను గడ్డు పరిస్థితి నుంచి కేసీఆర్ గట్టెక్కించారని ఆయన చెప్పారు. ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ సరఫరాపై చర్చించినట్టు తెలుస్తోంది.