చంద్రబాబు వణికిపోతున్నారు...
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు అంశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వణికిపోతున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్లో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మాట్లాడతూ... 10 ఏళ్ల పాటు హైదరాబాద్లో ఉండేందుకు అవకాశం మనకు ఉందని ఆయన తెలిపారు.
అయినా చంద్రబాబు మాత్రం విజయవాడకు నేను వెళ్లిపోతా, వెళ్లిపోతా అంటున్నారని ఆరోపించారు. ధైర్యం ఉంటే... ఆ గొంతు నాదికాదని చంద్రబాబు చెప్పగలరా? అని ప్రశ్నించారు. చంద్రబాబు నీతిమంతుడే అయితే.. శాసనసభలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. సభలో చర్చకు రాకపోతే అవినీతిపరులని ఒప్పుకున్నట్లే అని చెవిరెడ్డి తెలిపారు. అయితే ఈ అంశంలో ఆధారాలతోపాటు చెప్పడానికి మేం సిద్ధంగా ఉన్నామని చెవిరెడ్డి చెప్పారు.