'క్షమించండి.. కానీ అది సంస్థ నిర్ణయం కాదు'

'క్షమించండి.. కానీ అది సంస్థ నిర్ణయం కాదు' - Sakshi


వాషింగ్టన్: వినియోగదారులను మోసగించినందుకు అమెరికాలో వోక్స్ వ్యాగన్ గ్రూపు సీఈవో మైకేల్ హార్న్  క్షమాపణలు చెప్పారు. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించేలా సాఫ్ట్వేర్ ను డీజిల్ కార్లలోవాడినందుకు ఆయన విచారం వ్యక్తం చేశారు. యూఎస్ హౌస్ ఎనర్జీ, కామర్స్ సబ్ కమిటీ ఎదుట ఆయన హాజరయ్యారు. సాఫ్ట్వేర్ వాడకం సంబంధించి తనకు ముందస్తు సమాచారం లేదని హార్న్ కమిటీకి వివరించారు. కాగా ఈ సాఫ్ట్వేర్ను వాడాలన్నది తమ నిర్ణయం కాదని, దీన్ని రూపొందించిన నిపుణులే బాధ్యులని హార్న్ చెప్పారు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏ కారణంతోనే ఈ సాఫ్ట్వేర్ను తయారు చేశారని తెలిపారు.  





వోక్స్ వాగన్ ప్రపంచవ్యాప్తంగా 1.1 కోట్ల డీజిల్ కార్లకు ఒకే రకమైన సాఫ్ట్వేర్ వాడి కస్టమర్లను మోసం చేసినట్లు అంగీకరించిన సంగతి తెలిసిందే.  తొలుత అమెరికాలోని 5లక్షల కార్లలో మాత్రమే లోపాలున్నట్లు తెలిపిన సంస్థ యాజమాన్యం ఆ తర్వాత భారీ మోసాన్ని అంగీకరించింది. 2009-2015 మధ్య ఈ రకం మోడల్ కార్లను తయారు చేసింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top