'చంద్రబాబు ఔట్డేటెడ్'
హైదరాబాద్: చంద్రబాబు నాయుడు ఔట్ డేటెడ్ రాజకీయవేత్త అని, తాను ఈ జనరేషన్కు చెందిన నాయకుడినని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. ప్రత్యేక హోదాపై చర్చ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. సెల్ఫోన్లు కూడా తానే తెచ్చానని, ప్రపంచానికి ఐటీని పరిచయం చేసిన ఘనత తనదేనని కూడా చంద్రబాబు చెబుతారంటూ ఎద్దేవా చేశారు. ఆయన ఏమన్నారంటే...
-
ప్రత్యేక హోదా ఇచ్చే అధికారం కేవలం ప్రధానమంత్రి, కేబినెట్కు సంబంధించిన విషయం. -
ఇక్కడ మాత్రం కేబినెట్ నిర్ణయం అయిపోయినా, తీర్మానం అయిపోయినా పనులు జరగట్లేదు -
ఇప్పుడు 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. వీటిలో ఏ రాష్ట్రానికీ పార్లమెంటులో చట్టం ద్వారా ప్రత్యేక హోదా రాలేదు. -
ప్రధానులు కేబినెట్లో తీర్మానం పెట్టి ఆమోదం పొందితే వచ్చింది -
ఒక్కోసారి ఏం చేస్తున్నారంటే అయోమయంగా చెబుతున్నారు. అసలు ప్రత్యేక హోదా అన్నది లేదని, ఇప్పుడు రద్దు చేశారని కొందరు మంత్రులు అంటారు. -
అసలు హోదా ఉందా లేదా అని మా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఓ లేఖ రాశారు. -
దానికి మంత్రి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉపసంహరించే ఆలోచన లేదని స్పష్టం చేశారు -
ఒకసారి 14వ ఆర్థికసంఘం ఒప్పుకోలేదు కాబట్టి సమస్యలు వచ్చాయంటారు -
కొంతమంది ఒడిషా, మహారాష్ట్ర, తమిళనాడు అడ్డు తగులుతున్నాయంటారు -
ఈ మూడు రాష్ట్రాలు ఆరోజు మన రాష్ట్రాన్ని విభజించేటప్పుడు అప్పుడు కూడా ఉన్నాయి కదా.. అవన్నీ ఉండగానే మాటిచ్చారు -
ఇప్పుడు వాటి పేరు చెప్పడం ఎంతవరకు ధర్మం -
ఔట్ డేట్ అయిపోయిన, అరకొర జ్ఞానం ఉండే చంద్రబాబు నాయుడు చెప్పే విషయాలను వినాల్సిన ఖర్మ ఈ సభకు పట్టింది -
సెల్ఫోన్లు నేనే తెచ్చానని చంద్రబాబు చెబితే వినాల్సిన ఖర్మ మాకేంటి -
20 ఏళ్ల క్రితం ఈరోజే చంద్రబాబు తన మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు -
ఎవరు చెప్పినా రెండు రెళ్లు నాలుగే అవుతుంది.. ఎవరుచెప్పినా వాస్తవాలు వాస్తవాలే. -
మిమ్మల్ని బోనులో పులిలా పెట్టి కొట్టే కార్యక్రమం ఏదో జరుగుతున్నట్లు ఉంది.. దాన్నుంచి బయటపడి రాష్ట్రం కోసం పోరాడండి -
పార్లమెంటులోని ఆర్థికమంత్రిత్వ శాఖలో ఉండే పార్లమెంటరీ రీసెర్చి సంస్థ ఇచ్చిన పత్రాలు వీళ్లకు పనికిరావు -
ఆర్థిక సంఘానికి ప్రత్యేక హోదా ఉన్న, లేని రాష్ట్రాలకు కేటాయింపులతో సంబంధం లేదు -
కేంద్రం విధించే పన్నులను రాష్ట్రాలకు విభజించే విషయాన్నే ఆర్థిక సంఘం చూస్తుంది -
నాన్ ప్లాన్ గ్రాంటులు, రుణాల విషయం చూసుకుంటుంది -
ప్రణాళికా సంఘం మిగిలిన విషయాలు చూస్తుంది. కేంద్ర సాయం, అదనపు సాయం అన్నీ చూస్తుంది. -
ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు పెద్దగా బాగుపడలేదన్నట్లు బాబు చెబుతున్నారు -
ఉత్తరాఖండ్.. చాలా చిన్న రాష్ట్రం. ప్రత్యేక హోదా వచ్చాక రూ. 30 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇవి అంతకుముందు కంటే 42 రెట్లు ఎక్కువ. అక్కడ 130 శాతం యూనిట్లు వచ్చాయి. 490 శాతం ఉద్యోగావకాశాలు పెరిగాయి. -
10వేల కొత్త కంపెనీలు హిమాచల్ ప్రదేశ్లో వచ్చాయి. -
ప్రత్యేక హోదా వల్ల ఎంత గొప్ప మేలు జరుగుతుందంటే, ఐదేళ్ల పాటు కేంద్ర ఎక్సైజ్ పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. ఆదాయపన్ను కూడా ఐదేళ్ల పాటు కట్టక్కర్లేదు. మరో ఐదేళ్లు 70 శాతం పన్ను మినహాయింపు ఉంటుంది. -
ఇవి కాక ఈమధ్య కాలంలోనే కొన్ని రాష్ట్రాలకు రవాణా రీయింబర్స్మెంట్ కూడా చేస్తున్నారు -
ఇలాంటి ప్రయోజనాలు మన రాష్ట్రానికి ఉంటే.. 972 కిలోమీటర్ల తీరప్రాంతం ఉన్న మన రాష్ట్రానికి అన్ని రాష్ట్రాల నుంచి పారిశ్రామిక వేత్తలు వస్తారు -
లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు వస్తాయి. అదంతా ఈ ప్రోత్సాహకాలతోనే సాధ్యమవుతుంది. -
ఈమధ్య కాలంలోనే జీఎస్టీ బిల్లు వస్తోంది. అది వస్తే ఎక్సైజ్ డ్యూటీ ప్రయోజనాలు రావని సీఎం అన్నారు.