'ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే బాధ్యత కేంద్రానిదే'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వంపై ఉందని ఏపీ స్వీకర్ కోడెలశివప్రసాదరావు చెప్పారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలను కోట్ల రూపాయలు వెచ్చించి నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజాధనం వృథా కాకుండా, వ్యక్తిగత విమర్శలకు పోకుండా ప్రజా సమస్యలపై చర్చించాలని కోడెల సూచించారు.
వచ్చే అసెంబ్లీ సమావేశాలు రాజధాని ప్రాంతంలో నిర్వహించేందుకు యత్నిస్తామన్నారు. మాజీ సీఎం ఫోటోను అసెంబ్లీలో పెట్టే సాంప్రదాయం లేదని ఏపీ స్పీకర్ కోడెల స్పష్టం చేశారు.