ఫేస్‌బుక్‌లో గుడ్‌బై చెప్పి.. ఉరేసుకున్నాడు!

ఫేస్‌బుక్‌లో గుడ్‌బై చెప్పి.. ఉరేసుకున్నాడు! - Sakshi

అతడు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి. ఫేస్‌బుక్‌లో 'గుడ్ బై' అని మెసేజ్ పెట్టాడు. ఎక్కడికైనా వెళ్తున్నాడేమోనని స్నేహితులు అనుకున్నారు. కానీ, మర్నాడు ఏకంగా ఉరేసుకుని ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు. ఈ ఘటన పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగింది. సంప్రీత్ బెనర్జీ అనే ఈ విద్యార్థి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో ఎవరికీ తెలియదు. సూసైడ్ నోట్ కూడా ఏమీ పెట్టలేదు. హాఫ్ ఇయర్లీ పరీక్షలలో ఫలితాలు సరిగా రాకపోవడంతో నిరాశకు గురై ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. 

 

బాగా చదువుకుని పైకి వస్తాడన్న ఉద్దేశంతో సంప్రీత్ విషయంలో తాము కాస్త స్ట్రిక్టుగా ఉంటున్నమాట నిజమే కానీ, ఇలా చేస్తాడని అనుకోలేదని అతడి తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే వాళ్ల విషయంలో ఏమీ తప్పులేదని, ఒక టీచర్ అతడిని స్కూల్లో తరచు బాగా అవమానిస్తున్నారని స్నేమితులు చెప్పారు. ఆ టీచర్ క్ల్ఆసులో అందరిముందు శారీరకంగా, మానసికంగా సంప్రీత్‌ను చిత్రహింసలు పెడుతున్నట్లు అతడి తల్లి అపర్ణ ఆరోపించారు. అకౌంట్స్ టీచర్ అందరిముందు లేపి కొడుతుంటే సంప్రీత్ ఏడ్చేవాడని, అది కో ఎడ్యుకేషన్ స్కూలు కావడం, అతడు అప్పటికే టీనేజికి రావడంతో తీవ్ర అవమానంగా భావించాడని అన్నారు. ఆ టీచర్ శిక్షలకు ఎంతగా భయపడేవాడంటే, చివరకు అకౌంటెన్సీ క్లాసులు ఉంటాయని బుధ, శుక్రవారాల్లో స్కూలుకు వెళ్లడం కూడా మానేశాడని చెప్పారు. 

 

హాఫ్ ఇయర్లీ పరీక్షలలో తన క్లాస్‌మేట్లలాగే తాను కూడా అవే సమాధానాలు రాసినా తనకు ఎందుకు తక్కువ మార్కులు వేశారని సంప్రీత్ అడిగినప్పటి నుంచి ఆ టీచర్ అతడిని కొట్టడం మొదలుపెట్టారట. మొదటిరోజు చెంపమీద కొట్టి క్లాసు నుంచి బయటకు పంపేశారని, దాంతో సంప్రీత్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడని ఒక క్లాస్‌మేట్ చెప్పారు. బహుశా అందుకే ఈ తీవ్రనిర్ణయం తీసుకుని ఉంటాడని చెబుతున్నారు. 
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top