అరుణ్ జైట్లీకి కాంగ్రెస్ సవాల్

అరుణ్ జైట్లీకి కాంగ్రెస్ సవాల్ - Sakshi


న్యూఢిల్లీ: విదేశాల్లో అక్రమంగా సంపద దాచుకున్న ఖాతాదార్ల పేర్లు బయటపెట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి కాంగ్రెస్ పార్టీ సవాల్ బుధవారం విసిరింది. అర్థ సత్యాలు, లీకులు ఇవ్వకుండా పూర్తి వివరాలతో అక్రమార్కుల పేర్లు వెల్లడించాలని డిమాండ్ చేసింది.



బెదింపులకు తమ పార్టీ భయపడదని ఏఐసీసీ సమాచార విభాగం అధ్యక్షుడు అజయ్ మాకెన్ అన్నారు. వ్యక్తుల కంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమన్నారు. తమ పార్టీలో ఎవరు తప్పు చేశారని రుజువు చేసినా చర్య తీసుకోవచ్చన్నారు. అయితే అవాస్తవాలతో, అర్థ సత్యాలతో తమను ఇరికించాలని చూస్తే సహించబోమన్నారు.



విదేశాల్లో అక్రమంగా సంపద దాచుకున్న ఖాతాదార్ల పేర్లు బహిర్గతమైతే ఇరకాటంలో పడేది కాంగ్రెస్ పార్టీయేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మంగళవారం వ్యాఖ్యానించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top