‘మహా’ ఒప్పందం చీకటి దినం: షబ్బీర్ ఆలీ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్రతో ఒప్పదం కుదుర్చుకోవడాన్ని చీకటి దినంగా భావిస్తున్నట్టు మండలిలో కాంగ్రెస్ పక్షనేత షబ్బీర్ ఆలీ చెప్పారు. ఇండియన్ ఇస్లామిక్ స్టేట్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న ముస్లిం యోధుల ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమం బుధవారం ఢిల్లీలో ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న షబ్బీర్ ఆలీ మీడియాతో మాట్లాడుతూ.. 2012లో కిరణ్ కుమార్రెడ్డి హయంలో జరిగిన ఒప్పందాన్నే మళ్లీ ఇప్పుడు కేసీఆర్ కుదుర్చుకుని ఊరేగింపులు చేసుకుంటున్నారనివిమర్శించారు. ఎవరినీ సంప్రదించకుండా ఎగువ రాష్ట్రాలు బాబ్లీ, ఆల్మట్టి ప్రాజెక్టులను నిర్మించుకున్నాయన్నారు. తెలంగాణ భూ భాగంలో ప్రాజెక్టులు నిర్మించ డానికి మహారాష్ట్ర ప్రభుత్వ అనుమతి ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఫోటో ఎగ్జిబీషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాంనబీ ఆజాద్, దిగ్వీజయ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.