బీజేపీ కార్యకర్త హత్య, బంద్కు పిలుపు
కన్నూరు: కేరళలో కన్నూరు జిల్లా అండల్లూర్లో గుర్తు తెలియని దుండగులు చేసిన దాడిలో బీజేపీ కార్యకర్త మరణించాడు. మృతుడ్ని ఎజుతన్ సంతోష్ (52)గా గుర్తించారు.
బుధవారం అర్ధరాత్రి దుండగులు సంతోష్ ఇంటిపై దాడి చేసి ఆయన్ను తీవ్రంగా కొట్టారు. ఆ సమయంలో ఆయన భార్య, పిల్లలు ఇంట్లో లేరు. సంతోష్ వెంటనే తన స్నేహితుడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. పోలీసుల సాయంతో ఆయనను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా తీవ్రంగా గాయపడిన సంతోష్ రక్తస్రావంతో మరణించాడు. ఈ దాడి వెనుక సీపీఎం ప్రమేయముందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దాడిని ఖండిస్తూ గురువారం కన్నూరు జిల్లా బంద్కు పిలుపునిచ్చారు. కాగా బీజేపీ ఆరోపణలను సీపీఎం నాయకులు ఖండించారు.
సంబంధిత వార్తలు