మా ఎమ్మెల్యేలు పేదవారు!
న్యూఢిల్లీ: తమ పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు పేదవారని.. ఆ క్రమంలోనే ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేసిందని ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఒక్కో ఆప్ ఎమ్మెల్యే కు నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకూ ఇవ్వడానికి బీజేపీ ప్రయత్నించడాన్ని ఆయన తప్పుబట్టారు. సోమవారం పాండవాలన్ కాలన్ గ్రామంలో ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ప్రభుత్వాన్నిఏర్పాటు చేయడానికి బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ విమర్శించారు. కొంతమంది ఆప్ ఎమ్మెల్యేలు కమల నేతలను కలిసినా.. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీకి మద్దతు తెలపలేదన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
మరోమారు ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సెప్టెంబర్ 25వ తేదీ నుంచి బీజేపీ నేతలు యత్నాలు ఆరంభించనున్నారని కేజ్రీవాల్ అన్నారు. తమ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడానికి రూరల్ ప్రాంతాల్లో కేజ్రీవాల్ ర్యాలీ చేపట్టారు.
సంబంధిత వార్తలు