అత్యాచార ఘటనలో స్కూల్ చైర్మన్ అరెస్ట్


బెంగళూరు : బెంగళూరులో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటనకు సంబంధించి విబ్జియర్  పాఠశాల స్కూల్ చైర్మన్ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అత్యాచారానికి సంబంధించి ఆధారాలు లేకుండా చేయడానికి ప్రయత్నించారంటూ రోస్టమ్ కేరవాల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఈ ఘటనకు సంబంధించిన స్కూల్ చైర్మన్పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు బెంగళూరు నగర పోలీస్ కమిషన్ ఎం.ఎన్. రెడ్డి తెలిపారు.



విద్యార్థిని జులై 2న అత్యాచార ఘటన జరిగినప్పటికీ స్కూలు యాజమాన్యం ఆ విషయం బయటికి పొక్కకుండా దాచిపెట్టింది. ఈనెల 9వ తేదీన బాలిక తల్లిదండ్రులు స్కూలు యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. యాజమాన్యం పట్టించుకోకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. ఇక బాలికపై అత్యాచారం జరిపిన ఇద్దరు పాఠశాల సిబ్బందిని వర్థూర్‌ పోలీసులు అరెస్ట్ చేశారు.  కాగా ఈ  ఘటనపై బెంగళూరు నగరం ఆందోళనలు, నిరసనలతో అట్టుడికింది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top