శరద్ పవార్ కలిసి పనిచేయమన్నారు!
ముంబై: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమతో కలిసి పనిచేమయమని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆహ్వానించినట్లు ఆర్పీఐ నాయకుడు రాందాస్ ఆఠవలే తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో మహాకూటమిని వీడి తమతో కలిసి పోటీచేయాలని తనను శరద్ పవార్ కోరారన్నారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు అంశం ఇంకా ఒక కొలిక్కి రానందున ఆలోచించుకోమన్నారని ఆఠవలే తెలిపారు. అయితే తనకు మహాకూటమిని వీడే ఆలోచన లేదని స్పష్టం చేశానన్నారు.
మహాకూటమిలో సీట్ల సర్దుబాటు సమస్య ఉన్నా తమకు కనీసం 10 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ, శివసేనఅంగీకరిస్తాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మహాకూటమిలోని పార్టీలు ఐక్యంగా పోరాడితే ఈసారి రాష్ర్టంలో తమదే అధికారమని ఆయన నొక్కిచెప్పారు.