అమరావతి నుంచే నంద్యాల బల్బులు చూస్తున్నా
- ఆ విధంగా టెక్నాలజీని అభివృద్ధి చేశా: సీఎం చంద్రబాబు
నంద్యాల: రాజధాని అమరావతిలో కూర్చొని, అక్కడి నుంచే నంద్యాలలో బల్బులు వెలిగాయా? లేదా? అన్నది చూస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సెన్సార్లతో అలాంటి టెక్నాలజీని అభివృద్ధి చేశానని, హైదరాబాద్ను ప్రపంచ పటంలో పెట్టిందే కూడా తానేనని తెలిపారు. నంద్యాలను కూడా అదే రీతిలో అద్భుతంగా ముందుకు తీసుకెళతానన్నారు.
నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శనివారం పట్టణంలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలోనే రైతురుణమాఫీ పూర్తిగా జరగలేదు. అలాంటిది ఏపీలో మాత్రం రైతులకు రూ.24 వేల కోట్ల రుణాలను మాఫీ చేసిన ఘనత మాది. గడిచిన మూడు నెలలుగా అభివృద్ధి పనులు చేస్తున్నాం..’ అని గుర్తుచేశారు.