బాణాసంచా గోడౌన్లో మరో ప్రమాదం


దీపావళి దగ్గర పడేకొద్దీ తమిళనాడులో బాణాసంచా గోడౌన్లలో అగ్నిప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. గురువారం శివకాశీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించి తొమ్మిది మంది మరణించిన ఘటనను మరువక ముందే అదే రాష్ట్రంలోని కోయంబత్తూరులో శుక్రవారం మరో ప్రమాదం సంభవించింది. 

 

ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా మరో పది మంది వరకు తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. ఈ ప్రమాదానికి కారణం ఏంటో తెలియరాలేదు. గోడౌన్‌లో ఇంకా కొందరు చిక్కుకుపోయి ఉంటారని అంటున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top