మంత్రి గంటాకు నాన్బెయిలబుల్ వారెంట్
ఆదేశాలు జారీచేసిన అనకాపల్లి కోర్టు
అనకాపల్లి: రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు అనకాపల్లి రెండో అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జి.వి.వి.సత్యనారాయణమూర్తి నాన్బెయిలబుల్ వారంట్ జారీ చేశారు. 2009 ఎన్నికల్లో గంటా అనకాపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సందర్భంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కేసు నమోదైంది.
ఈ కేసు విచారణ కోసం మంత్రి గంటా బుధవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన విచారణకు రాకపోవడంతో మేజిస్ట్రేట్ నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేశారు.