'ఆయనకు పద్మవిభూషణ్ సరిపోదు'
కోల్ కతా: బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ కు పద్మవిభూషణ్ తో సరిపెట్టడం సరికాదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. భారతరత్నకు అమితాబ్ బచ్చన్ అన్నివిధాలా అర్హుడని పేర్కొన్నారు. 'అమితాబ్ కు పద్మవిభూషణ్ సరిపోదు. సినిమా రంగంలో ఆయన దిగ్గజం. భారతరత్నకు ఆయన అర్హుడు' అని మమతా బెనర్జీ ట్విటర్ లో పోస్టు చేశారు.
అమితాబ్ తో పాటు దిలీప్ కుమార్ కు కేంద్ర ప్రభుత్వం ఆదివారం పద్మవిభూషన్ పురస్కారం ప్రకటించింది. దర్శకులు జాన్హు బారువా, సంజయ్ లీలా బన్సాలీ, గీతరచయిత ప్రసూన్ జోషి తదితరులకు పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి.
The Padma Vibhushan to @SrBachchan not enough. Not enough. He is a legend in his lifetime. He deserves a Bharat Ratna.
— Mamata Banerjee (@MamataOfficial) January 26, 2015