అమిత్ షా బంధువంటూ ఎమ్మెల్యేకు టోకరా


భోపాల్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు బంధువంటూ ఓ యువకుడు.. మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే మోహన్ యాదవ్ను మోసం చేశాడు. వేలాది రూపాయలు కాజేసి ఉడాయించాడు. శుక్రవారం యాదవ్ వివరాలను వెల్లడించారు.



ఉజ్జయిని ఎమ్మెల్యే యాదవ్కు గత బుధవారం ఉదయం ఓ యువకుడు ఫోన్ చేసి, తన పేరు నీరజ్ షా అని తాను అమితా షాకు దగ్గరి బంధువని చెప్పాడు. తాను ఉజ్జయినికి వచ్చానని, తాను సమస్యల్లో ఉన్నానని సాయం చేయాల్సిందిగా ఆ  యువకుడు ఎమ్మెల్యేను కోరాడు. ఆ సమయంలో యాదవ్ భోపాల్లో ఉన్నారు. దీంతో యాదవ్ ఉజ్జయినిలోని తన స్నేహితుడు  నరేష్ శర్మకు ఫోన్ చేసి ఆ యువకుడికి సాయం చేయాల్సిందిగా చెప్పారు. నరేష్ శర్మ ఆ యువకుడిని ఇంటికి తీసుకువచ్చి ఆతిథ్యం ఇచ్చారు. ఫోన్ పోయిందని ఆ చెబితే నరేష్ శర్మ మొబైల్ ఫోన్ కొనిచ్చారు. ఆ యువకుడు అహ్మదాబాద్ వెళ్లేందుకు విమానం టికెట్ కొనిచ్చి సాయం చేశారు. ఆ తర్వాత ఆ యువకుడి గురించి ఆరా తీసిన ఎమ్మెల్యే  తాను మోసపోయానని తెలుసుకున్నారు. యాదవ్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top