ఆర్డరిచ్చిన రోజే డెలివరీ

ఆర్డరిచ్చిన రోజే డెలివరీ


న్యూయార్క్: ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సంస్థ అమెజాన్ సరికొత్త ప్రకటన చేసింది. వినియోగదారులు ఏదైన వస్తువు కొనుగోలుకు ఆర్డిరిచ్చిన రోజే చేరవేస్తామని ప్రకటించింది. పుస్తకాలు, ఎలక్ట్రానిక్స్ వంటి వాటితోపాటు దాదాపు 1 మిలియన్ వస్తువులు గురువారం షాపింగ్ కోసం ఉంచామని వీటిని కొనుగోలు చేసిన 14 మెట్రోనగరాల్లోని వినియోగదారులకు వాటిని వెంటనే చేరవేస్తామని తెలిపింది. ముఖ్యంగా న్యూయార్క్, లాస్ ఎంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, ఫిలడెల్పియా, పోనిక్స్, అట్లాంటా ప్రాంతాల వినియోగదారులకు ఈ సదుపాయం అందుబాటులోకి తెస్తామని చెప్పింది. దీని ప్రకారం ఒక వేళ మధ్యాహ్నం ఆర్డరిస్తే... రాత్రి తొమ్మిది గంటలకు డెలివరీ చేస్తారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top