అఖిలేశ్కు భయం పట్టుకుంది!
ఫతెపూర్: ఉత్తరప్రదేశ్లో శాంతిభద్రతలను కాపాడటంలో సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్లో గూండారాజ్ నడుస్తున్నదని, సుప్రీంకోర్టు సైతం జోక్యం చేసుకొని ఒక మంత్రిని రేప్ కేసులో బుక్ చేయించిందని ఆయన పేర్కొన్నారు. మంత్రి గాయత్రి ప్రసాద్ ప్రజాపతిపై ఎఫ్ఆర్ఐ నమోదు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫతేపూర్ సభలో ఆయన మాట్లాడుతూ యూపీ సీఎం అఖిలేశ్పై విరుచుకుపడ్డారు. ’అఖిలేశ్ ముఖం కళ తప్పింది. ఆయన స్వరం బలహీనపడింది. ఆయన భయపడుతున్నారు. మీడియాతో మాట్లాడేటప్పుడు సరైన పదాల కోసం తడబడుతున్నారు’ అని మోదీ పేర్కొన్నారు. అఖిలేశ్ ఇప్పటికే ఓటమిని అంగీకరించారని చెప్పారు. ప్రజల మానప్రాణాలకు భద్రత కల్పించే ప్రభుత్వానికి ఓటు వేయాలంటూ ఆయన ఓటర్లను కోరారు.